లెనిన్ హిట్.. భారీగా పెరిగిన భాగ్యశ్రీ రెమ్యునరేషన్?
ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టువిడవకుండా మన ప్రయత్నం సాగిస్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా విజయం దొరుకుతుందని కొందరి జీవితాలు పాఠాలుగా నిలుస్తాయి. ఈ కోవలకే వస్తారు అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే. దాదాపు 11 ఏళ్లుగా హిట్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అఖిల్. ప్రతిసారి ఎన్నో అంచనాల మధ్య రావడం ఆ సినిమా కాస్తా పరాజయం పాలవ్వడం షరా మామూలే అన్నట్లుగా తయారైంది. ఈ పరిస్ధితిని మార్చి ఈసారి హిట్ కొట్టాలనే సంకల్పంతో అఖిల్ కష్టపడ్డారు. దానికి ప్రతిఫలమే లెనిన్ మూవీ సక్సెస్.
అఖిల్ను నటుడిగా మరో మెట్టుపైకి ఎక్కించిన సినిమాగా, ఆయన కెరీర్లో టర్నింగ్ పాయింట్గా నిలిచింది లెనిన్. ఈ విజయంతో అఖిల్ ఎమోషనల్ అవుతున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్లో కంటతడి పెట్టిన ఆయన తన తండ్రి నాగార్జున పాదాలకు నమస్కరించి వెక్కి వెక్కి ఏడ్చారు. ఇక్కడే కాదు ఈవెంట్స్లోనూ లెనిన్లో విజయం తాలూకా భావోద్వేగం కనిపిస్తూనే ఉంది. ఎట్టకేలకు లెనిన్తో తమ హీరో ట్రాక్ ఎక్కేశాడని అక్కినేని అభిమానులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు.
ఇక మరొకరు భాగ్యశ్రీ బోర్సే. అందం, అభినయం ఉన్నప్పటికీ కెరీర్ స్టార్టింగ్ నుంచి నేటి వరకు ఈ ముద్దుగుమ్మకు హిట్ దక్కలేదు. దాంతో ఐరన్ లెగ్ అన్న ముద్ర పడింది. మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టారు భాగ్యశ్రీ బోర్సే. తొలి సినిమాతోనే అందం, లుక్స్ పరంగా కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ అనిపించుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత కింగ్డమ్, ఆంధ్రా కింగ్ తాలూకా, కాంత సినిమాలలో నటించారు. అన్ని స్టార్ హీరోల సినిమాలే.. బాగా చేసిందన్న పేరు తప్పించి ఆమెకు విజయం మాత్రం దక్కలేదు.
ఈ క్రమంలో లెనిన్లో భారతిగా ఆఫర్ వచ్చింది. ఫస్ట్ లుక్ నుంచే భాగ్యశ్రీ తన ముద్ర వేయడం ప్రారంభించారు. నాటకాలలో దుర్యోధనుని పాత్ర.. దానవీర శూరకర్ణలోని ఎన్టీఆర్ ఫేమస్ డైలాగ్ ఏమంటివి.. ఏమంటివిని అద్భుతంగా పలికి శెభాష్ అనిపించుకుంది. సినిమా విడుదలయ్యాక అఖిల్తో సమానంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కెరీర్లో తొలి హిట్ అందుకున్నారు భాగ్యశ్రీ. సక్సెస్ సెలబ్రేషన్స్లో భావోద్వేగానికి గురై కంటతడి పెట్టింది ఈ ముద్దుగుమ్మ. తనపై ఐరన్ లెగ్ ముద్ర వేశారని.. కానీ అభిమానులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈరోజు ఇక్కడ నిలబడ్డానని చెప్పారు. హైదరాబాద్ నా కర్మభూమి.. నా చివరి సినిమా కూడా తెలుగు చిత్ర పరిశ్రమ నుంచే ఉంటుందని భాగ్యశ్రీ ఎమోషనల్ అయ్యారు.
లెనిన్ విజయం కారణంగా భాగ్యశ్రీకి అవకాశాలు క్యూకట్టే అవకాశం ఉంది. అంతేకాదు.. తన రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసినట్లుగా ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లెనిన్కు ముందు వరకు సినిమాకు కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న ఈ మరాఠీ భామ.. ఇప్పుడు 2 కోట్ల రూపాయల్ని డిమాండ్ చేస్తోందట. అందం, అభినయం, యువతలో ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా భాగ్యశ్రీ ఎంత అడిగితే అంత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం తమిళంలో సియోన్ మూవీలో నటిస్తున్నారు భాగ్యశ్రీ.
.jpg)
.jpg)


.jpg)
.jpg)
