loksabha elections 2024 : మోడీ అండ్ కో ‘‘ సంకల్ప పత్రం ’’ .. బీజేపీ మేనిఫెస్టో ఇదే

 


త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ‘‘సంకల్ప పత్రం ’’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌లు మేనిఫెస్టోను ఆవిష్కరించారు. మోడీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో దీనిని రూపొందించారు. 

Also Read : లోక్‌సభ ఎన్నికలు : కర్ణాటకలో వీఐపీ సెగ్మెంట్లు ఇవే .. అందరిచూపూ ఇటే ..?

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. ఇందుకోసం దాదాపు 15 లక్షల సలహాలు , సూచనలను పరిశీలించింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతుల అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ ఈ మేనిఫెస్టోను రూపొందించింది. 

ఇందులో 14 ప్రధాన అంశాలను చేర్చారు. విశ్వబంధు, సురక్షిత భారత్, సమృద్ధ భారత్, ఈజ్ ఆఫ్ లివింగ్, గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సాంస్కృతిక వికాసం, సుపరిపాలన, స్వస్థ భారత్, అత్యుత్తమ శిక్షణ, సంతులిత అభివృద్ధి, సాంకేతిక వికాసం, సుస్థిర భారత్, క్రీడా వికాసం వున్నాయి. 

బీజేపీ మేనిఫెస్టో - ‘‘సంకల్ప పత్రం ’’లోని ముఖ్యాంశాలు :

  • రక్షణ, వంటనూనె, ఇంధన రంగాల్లో స్వయం సమృద్ధి
  • వ్యవసాయ మౌలికవసతుల మిషన్‌ ప్రారంభం
  • విదేశాల్లోని భారతీయుల భద్రతకు హామీ
  • వ్యవసాయ అవసరాల నిమిత్తం ప్రత్యేక ఉపగ్రహం
  • చిన్నరైతుల లబ్ధి కోసం శ్రీఅన్న సాగు ప్రోత్సాహం
  • ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు
  • స్టార్టప్ సంస్థలకు నిధులు, మెంటార్‌షిప్‌తో మద్దతు
  • ఉపాధి అవకాశాలను మెరుగుపర్చే కొత్త శాటిలైట్‌ పట్టణాల ఏర్పాటు
  • ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువర్‌ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
  • సేవారంగంతో స్వయం సహాయక సంఘాల అనుసంధానం
  • తమిళ భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి
  • విమానయాన రంగానికి చేయూత
  • విద్యుత్తు వాహన రంగానికి ప్రోత్సాహం
  • అంతరిక్ష రంగంలో భారత సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళిక
  • వందేభారత్‌ విస్తరణ
  • ఉద్యోగ నియమకాల్లో పేపర్‌ లీకేజీల నివారణకు కఠిన చట్టం, పారదర్శకంగా నియామక ప్రక్రియ
  • దేశ ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్‌ రైలు
  • పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన ద్వారా ఉచిత విద్యుత్తు
  • గ్రీన్‌ ఎనర్జీ, ఫార్మా, సెమీ కండక్టర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇన్నోవేషన్‌, లీగల్‌ ఇన్సూరెన్స్‌, వాహన రంగాల్లో ప్రపంచ స్థాయి హబ్‌ల ఏర్పాటు
  • గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి, వినియోగానికి ప్రోత్సాహం
  • కూరగాయల సాగు, వాటి నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
  • మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
  • మత్స్య ఉత్పత్తి, ప్రాసెసింగ్‌ కోసం ప్రత్యేక క్లస్టర్లు
  • ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం
  • 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యం
  • డెయిరీ సహకార సంఘాల సంఖ్య పెంచేందుకు కృషి
  • 3 కోట్ల ఇళ్ల నిర్మాణం
  • ఉచిత రేషన్‌ మరో ఐదేళ్లు పొడిగింపు
  • పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంటగ్యాస్‌
  • ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంపు
  • దివ్యాంగుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణం
  • ట్రాన్స్‌జెండర్లకు సైతం ఆయుష్మాన్‌ భారత్‌
  • వృద్ధుల కోసం ఆయుష్‌ శిబిరాల నిర్వహణ
  • పుణ్యక్షేత్రాల పర్యటనల కోసం రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో వృద్ధులకు చేయూత
  • 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక


Comments